ఘనంగా శనిత్రయోదశి వేడుకలు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం పలు ఆలయాలో శనిత్రయోదశి వేడుకలుఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ భక్త మార్కెండేయ ఆలయం, శివవీధిలోని శివాలయంలో శని త్రయోదశి వేడుకలుసందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనము కోసం భక్తులు బారులు తీరారు. నవగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తైలాభిషేకం నిర్వహించారు. శనివారం రోజున త్రయోదశి రావడంతో, శని దేవునికి భక్తులు ప్రత్యేక తైలాభిషేకం నిర్వహిచారు. ఆలాగే జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో శని దేవునికి పూజలు నిర్వహించారు